తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కారు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జగిత్యాల ఎస్పీగా అశోక్కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుత్రాజ్, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి నియమితులయ్యారు.