దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ లేకుండానే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. అక్కడి మెజెంటా లైన్ మార్గంలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు నడవనుంది. జూలై 1 నుండి ఇది ప్రారంభం కానుందని డీఎంఆర్సీ (DMRC) తెలిపింది. డ్రైవర్లెస్ మెట్రో 2020 సంవత్సరంలో మెజెంటా లైన్లో దశలవారీగా ప్రారంభించారు. ఈ మెట్రో రెండు కెమెరాల సహాయంతో నడువనుంది. ఇది కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించబడుతుంది. ఒక కెమెరా మెట్రో ట్రాక్పై నిఘా ఉంచగా, మరో కెమెరా ఓవర్హెడ్ కేబుల్పై నిఘా ఉంచుతుంది.