గుజరాత్లో రూ.400 కోట్ల విలువైన మాదవ ద్రవ్యాలను ఇవాళ స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పాకిస్థానీయులను అరెస్ట్ చేశారు. డ్రగ్ సరఫరాకు వీరు వినియోగించిన నౌక భారత్కు చెందినదిగా గుర్తించారు. ఢిల్లీ, పంజాబ్లకు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే గుజరాత్ తీరంలో ఈ స్థాయిలో డ్రగ్స్ను పట్టుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం.