భారీ ఎన్‌కౌంటర్‌.. 20కి చేరిన మృతుల సంఖ్య

60చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్‌.. 20కి చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 20 మందిని హతమార్చారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌గార్డ్‌, CRPF బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

సంబంధిత పోస్ట్