ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

71చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 800 మంది పోలీస్ బలగాలతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్