యూపీలో భారీ అగ్ని ప్రమాదం నెలకొంది. ఫరూఖాబాద్లోని అమృత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 22 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.