ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీ చోరీ జరిగింది. మంత్రాలయం మండలం రచ్చుమర్రిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు 70 తులాల బంగారు నగలు, రూ. 4 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. యజమాని కుటుంబసభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లొచ్చే సరికి చోరీ జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.