మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ శివారులో కరెంటు షాక్ తో రైతు మృతి చెందాడు. శనివారం రాత్రి వీసిన గాలి దుమారనికి 11 కెవి వైర్ తెగి నేలపై పడటంతో ఆదివారం నాడు ఉదయం అది గమనించక నిజాంపేట గ్రామానికి చెందిన రైతు బక్కొల మల్లేశం (48) కాలు తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.