వనదుర్గా మాత రథం ఏర్పాటుకై కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళం

854చూసినవారు
వనదుర్గా మాత రథం ఏర్పాటుకై కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళం
ఏడుపాయల పుణ్యక్షేత్రంలోని వనదుర్గా మాత రథం ఏర్పాటుకై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ. 5 లక్షల విరాళం అందించారు. తన ఎమ్మెల్సీ వేతనం నుండి ఆలయ కమిటీకి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచన మేరకు వారి ద్వారా ఎమ్మెల్సీ కవిత విరాళం అందజేశారు.

మెదక్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఏడు పాయలలోని వనదుర్గా మాత ఆలయంలో నూతన రథం ఏర్పాటుకై శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ. 5 లక్షల విరాళం చెక్కును అందజేశారు. అమ్మవారి మీద అచంచలమైన భక్తితో ఉడతా సాయంగా తన వంతుగా, ఎమ్మెల్సీ వేతనం నుండి రూ. 5 లక్షల విరాళం అందిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ మేరకు రూ. 5 లక్షల చెక్కును ఆలయ కమిటీకి స్థానిక శాసన సభ్యులు పద్మ దేవేందర్ రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ కవిత అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్