బోనాల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

753చూసినవారు
బోనాల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ జిల్లా రామయంపేట్ పట్టణంలోని ముదిరాజ్ సోదరులు నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి కల్యాణ మహోత్సవం ను పురస్కరించుకుని శుక్రవారం జరిగిన బోనాల ఊరేగింపులో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొని బోనాలు ఎత్తుకున్న వందలాది మంది మహిళలతో కలసి పెద్దమ్మ తల్లి ఆలయం చేరుకున్నారు. అనంతరం తన వెంబడి ఉన్న పార్టీ మరియు ముదిరాజ్ సంఘ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పలువురు ముదిరాజ్ సంఘ నాయకులు శాలువాలు కప్పి ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి కల్యాణ మహోత్సవం ను పురస్కరించుకొని పట్టణ ముదిరాజ్ సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపి ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు తెలంగాణ ముదిరాజ్ సంఘం కార్యదర్శి పుట్టి అక్షయ్, పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు, రామయంపేట్ యువ నాయకులు రంజిత్, సురేష్ నాయక్, సర్పంచులు మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్ యువ నాయకులు స్వామి నాయక్, ప్రశాంత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్