పారదర్శకంగా కౌన్సిలింగ్ ద్వారా జిల్లా సివిల్ పోలీసు సిబ్బంది బదిలీలు

465చూసినవారు
పారదర్శకంగా కౌన్సిలింగ్ ద్వారా జిల్లా సివిల్ పోలీసు సిబ్బంది బదిలీలు
మెదక్ జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో జిల్లా పరిదిలో పనిచేయుచున్న జిల్లా సివిల్ కానిస్టేబుల్ మొత్తం 70 మంది సిబ్బందికి మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించి, వారి స్యమస్యలు అడిగి తెలుసుకొని జిల్లా పరిధిలో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలతో మంచి సత్ససంబందాలను ఏర్పాటు చేసుకుని, ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనిచేసి జిల్లాకు , పోలీస్ డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డా. బి. బాలస్వామి ఐ.పి.యెస్ మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్