వ్యక్తి అదృశ్యం..అడవిలో మృతదేహం లభ్యం
రామాయంపేట శివారులోని అడవి ప్రాంతంలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు రామాయంపేటకు చెందిన పుట్టి చిన్న స్వామిగా గుర్తించారు. గత నెల 31న ఇంటి నుండి వెళ్లిన పుట్టి స్వామి తిరిగి రాలేదు నేడు మృతదేహం కనిపించడంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.