జీ7 సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ వెళ్లనున్న నేపథ్యంలో.. ‘MELODI’ అనే హ్యాష్ట్యాగ్తో కూడిన పోస్ట్లు మరోసారి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇటలీ ప్రధాని మెలోని గత ఏడాది డిసెంబర్లో మోదీతో దిగిన సెల్ఫీని షేర్ చేసి 'మంచి స్నేహితులు #MELODI' అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుండి, వారి ఫోటోలతో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జీ7లో భారత్ ఆర్థిక వ్యవస్థ 4 దేశాలను అధిగమించిన నేపథ్యంలో మోదీని మెలోని ప్రత్యేకంగా ఆహ్వానించారు.