అన్నా క్యాంటీన్ల రీ ఓపెనింగ్‌పై మంత్రి కీలక ప్రకటన

81చూసినవారు
అన్నా క్యాంటీన్ల రీ ఓపెనింగ్‌పై మంత్రి కీలక ప్రకటన
ఏపీలో అన్నా క్యాంటీన్ల రీ ఓపెనింగ్‌పై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను అతి త్వరలోనే రీ ఓపెనింగ్ చేస్తామన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. అన్నా క్యాంటీన్లలో 3 పూటలా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లకు అనుమతి ఇచ్చామని, ఒక 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్