కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బృందం

64చూసినవారు
కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బృందం
AP: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళాలో ఏర్పాట్లను మంత్రి నారాయాణ బృందం అధ్యయనం చేస్తోంది. 2027లో రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్గ్ సహా పలువురు కుంభమేళాను సందర్శించారు. ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ క్లియరెన్స్, భద్రతా చర్యల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల స్నాన ఘాట్లను పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్