ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడి 12 మంది మరణించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తంచేశారు.