ఏపీలో సీఎం చంద్రబాబు, కేబినెట్ ప్రమాణ స్వీకార సమయంలో బుధవారం అరుదైన సన్నివేశం జరిగింది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ఈ దృశ్యం చూసిన అభిమానులు చప్పట్లతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. మరో వైపు మెగాబ్రదర్స్తో మోడీ అభివాదం చేయడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనందాన్ని చూసే సమయంలో రెండు కళ్లూ సరిపోవడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.