ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఒడిశా సీఎంగా మోహన్ మాఝీని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాఝీ.. ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.