మద్యం మత్తు, అపరిమిత వేగంతో.. ఎదురుగా ఏమొస్తుందో కూడా గ్రహించలేక కొందరు దూసుకెళ్తున్నారు. ఇలాంటి సమయాల్లో నిబంధనల ప్రకారం ముందుకు సాగేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారి కారణంగా.. రోడ్డుపక్క నడిచే వారూ, రోడ్డుపక్కన ఉండే అమాయకులూ ప్రాణాలను కోల్పోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాల్లో మినహా, ఇతర జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లపై వెళ్లే వాహనదారుల విషయంలో తనిఖీలు మృగ్యమే.