జీవితంపై విరక్తితో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలో చోటు చేసుకుంది. కలబురగిలోని ఎంబీ నగరలో నివసించే తల్లి సుమలత (45), కూతురు వర్ష (22) సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి శహబాద్ దగ్గర కాగిణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం వీరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. జీవితంపై విరక్తి కలిగే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసింది.