ఓటే ముందు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు!

80చూసినవారు
ఓటే ముందు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు!
ప్రజాస్వామ్యంలో ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఓటు ఎంత ముఖ్యమైనదో మరోమారు నిరూపితమైంది. దేవ్‌కులి గ్రామానికి చెందిన మిథిలేశ్‌ యాదవ్‌ తల్లి (80) మరణించారు. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని చర్చించుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ ఓటుకే జై కొట్టారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నట్టే అందరూ కలిసి ఓటు వేసి వచ్చిన తర్వాత తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్