ఉద్యమకాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారని మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం ఏర్పడుతుందన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా BRSకే మేలు జరుగుతుందన్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారవుతుందని చెప్పారు. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని.. రానున్న రోజులు మనవేనన్నారు.