మహిళను క్యాబ్ డ్రైవర్‌ వేధించిన కేసులో ఓలాకు రూ.5 లక్షలు ఫైన్

54చూసినవారు
మహిళను క్యాబ్ డ్రైవర్‌ వేధించిన కేసులో ఓలాకు రూ.5 లక్షలు ఫైన్
మహిళను వేధించిన కేసులో ‘ఓలా’కు భారీ షాక్ తగిలింది. ఓలా సంస్థకు రూ.5 లక్షల భారీ జరిమానా విధిస్తూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2018 ఆగస్టులో ఓ మహిళ ఓలా రైడ్‌ను బుక్ చేసుకుంది. ఈ క్రమంలోనే క్యాబ్ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆ మహిళ ఆరోపిస్తూ కేసు పెట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం, పిటిషనర్‌కు అదనంగా రూ.50 వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్