తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

82చూసినవారు
తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్పిఆర్డి దివ్యాంగుల సంఘం నాయకులు బుదవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలీశ్వర్ మాట్లాడుతూ తాడూరు గ్రామానికి చెందిన వికలాంగుడు వస్పరి నరసయ్య పై దాడి చేసిన వ్యక్తులపై 2016 వికలాంగుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న, దివ్యాంగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్