గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు సోమవారం చందంపేట మండలం తెల్దేవరపల్లి గ్రామంలో సిసి రోడ్డు, దేవాలయ ఆర్చి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి, జడ్పిటిసి బుజ్జి, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు,
గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.