మెడికల్ సీట్లు కేటాయించడం కోసం జరిగిన నీట్ పరీక్షలో గిరిజన విద్యార్థిని భూక్యా సిరి వెన్నెల సాయి జాతీయ స్థాయిలో గిరిజన కేటగిరిలో 18వ ర్యాంక్ సాధించడం అభినందనీయమని మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఇంటికి వెళ్లి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.