బిహార్‌ తరహాలో ఏపీలో టీడీపీ దాడులు: పేర్ని నాని

60చూసినవారు
బిహార్‌ తరహాలో ఏపీలో టీడీపీ దాడులు: పేర్ని నాని
ఏపీలో వైసీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బిహార్‌ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్‌ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైసీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండ్డారు.

సంబంధిత పోస్ట్