ఫ్యామిలీ పెన్షన్ జీవో సవరణకు చొరవచూపాలి

56చూసినవారు
ఫ్యామిలీ పెన్షన్ జీవో సవరణకు చొరవచూపాలి
సీపీఎస్ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన ఫ్యామిలీపెన్షన్ జీవోను సవరించాలని సి. పి. ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్ కోరారు. ఈ మేరకు బుధవారం నల్గొండ ఎంపి రఘువీర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. రిటైర్డ్ సి. పి. ఎస్ ఉద్యోగులుమరణిస్తే వారికుటుంబ సభ్యులకు పెన్షన్ అందక, వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫ్యామిలీ పెన్షన్ జీవో 58 ని సవరించి బాధితులకు పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్