పదోన్నతుల్లో అసంబద్ధ విధానాన్ని తొలగించాలి

62చూసినవారు
పదోన్నతుల్లో అసంబద్ధ విధానాన్ని తొలగించాలి
విద్యాశాఖలో చేపడుతున్న పదోన్నతుల్లో అసంబద్ధ విదానాన్ని తొలగించాలని నల్గొండ బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ దశరథ్ నాయక్ కోరారు. బుధవారం భోజన విరామ సమయంలో పదోన్నతుల్లో అవలంబిస్తున్న విధానానికి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పదోన్నతుల్లో ఒకటి కంటే ఎక్కువ పదోన్నతులు వచ్చే ఉపాద్యాయులను వారి ఐచ్చికాలను తీసుకోని మిగిలిన ఖాళీలను వారి తర్వాత ఉన్న సీనియర్లతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్