మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ళలో సంజీవరెడ్డి అనే రైతు నారుమడికి శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టడంతో నారుమడి అంతా ఆగమైంది. కాగా కొందరు వ్యక్తులు నాయకుల అండదండలతో ఈ పని చేశారని ఆ రైతు అనుమానం వ్యక్తం చేస్తూ వాపోతున్నారు. మొత్తం 40 ఎకరాలకు సరిపోయే నారుమడి ఆగమైందని సంజీవరెడ్డి తెలుపుతున్నారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.