నూతన ఎంఈవో వూటుకూరు సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

83చూసినవారు
నూతన ఎంఈవో వూటుకూరు సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
చండూరు మండల నూతన విద్యాధికారిగా నియామకం పొందిన వూటుకూరు సుధాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి బోడంగిపర్తి ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా పిఆర్టియు చండూరు అధ్యక్షకార్యదర్శులు ఎడ్ల బిక్షం, మాదగోని వెంకటేశ్వర్లు నూతన విద్యాధికారికి సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్