మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

153చూసినవారు
మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
ప్రముఖ సంఘ సేవకురాలు, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 192 జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ సావిత్రి బాయి పులే చిత్రపటానికి పులామాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన ఆధ్వర్యంలో తేరట్పల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పి. రాణి, పాఠశాల పారిశుద్ధ్య కార్మికురాలు భూలక్ష్మి తో పాటు పాఠశాల ఆవరణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల టీచర్ ఉషారాణి, ఆయాలు లక్ష్మమ్మ, కొండమ్మలను సన్మానించారు. ఈ సందర్భంగా లచ్చిరామ్ మాట్లాడుతూ. స్త్రీల విద్య కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే అని, కేవలం విద్యా ద్వారా మాత్రమే సమాజంలోని అసమానతలను తగ్గించవచ్చు అని నమ్మి స్త్రీల కోసం అనేక పాఠశాలలు స్థాపించిన సంఘసంస్కర్త అని వారి సేవలను కొనియాడారు. ఈ జయంతి వేడుకలకు ప్రధానోపాధ్యాయులు సధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు సాయిరాం, నరసింహ, మురుసు మల్లేష్, వెంకటేశ్వర్లు అతిథులుగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్