నల్గొండ జిల్లా కలెక్టర్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర సోమవారం ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ సమీపంలోని చెన్నకేశవ పాఠశాలలో కలెక్టర్ ఓటు వేశారు. సామాన్య ప్రజలతో పాటు క్యూలో నిలబడి కలెక్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.