ఈనెల 24 నుండి జూన్ 3 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్దులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఐపీఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.