పలు వివాహా వేడుకలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం హాజరైయ్యారు. కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన పుట్ట శ్రీనివాస్ కుమారుడి వివాహానికి, రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన గోదుమల సోమయ్య కుమార్తె వివాహానికి, చిట్యాలలో పాటి భాస్కర్ రెడ్డి కుమార్తె వివాహానికి, నార్కెట్పల్లి గుమ్మలబావి గ్రామానికి చెందిన ఆమనగంటి శేఖర్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు.