ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు చెప్పిన సినీ నటుడు ఎన్టీఆర్కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ చేసిన పోస్ట్కు రిప్లై ఇస్తూ, ‘థ్యాంక్యూ వెరీ మచ్ డియర్ తారక్’ అని సమాధానం ఇచ్చారు. కాగా నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో నారా లోకేశ్ 90 వేలకు పైగా ఓట్లతో ఘన విజయం అందుకున్నారు.