ఇంటర్ లో ఫెయిల్.. ఇద్దరు విద్యార్థులు సూసైడ్
ఇంటర్ ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమరచింత మండలం సింగంపేటకు చెందని నితీష్ ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిలయ్యాడు. దీంతో నితీష్ ఆత్మకూరు సమీపంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి ఇంటర్ ఫెయిలైంది. దీంతో మంగళవారం ఇంట్లో ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకుంది.