NDRF సాహసం.. చిమ్మ చీకట్లో ఆరుగుర్ని కాపాడారు (వీడియో)

258106చూసినవారు
భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలమైంది. రాష్ట్రంలో ప్రధానమైన బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. మండి జిల్లాలోని నగ్‌వయిన్ గ్రామ సమీపంలో బియాస్ నది ఉప్పొంగడంతో పలువురు అక్కడే చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిమ్మచీకట్లో జిప్‌లైన్ ఏర్పాటు చేసి కేబుల్ సాయంతో ఆరుగురిని సురక్షితంగా కాపాడారు.

సంబంధిత పోస్ట్