నూతనంగా నియమితులైన ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్లో వారిరువురు భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్లో ఫొటోలు షేర్ చేస్తూ.. పోస్ట్ చేసింది. అయితే జ్ఞానేశ్ కుమార్ బుధవారం.. 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.