వివిధ కులాలు, మతాలు, భాషలు మాట్లాడే ప్రజలు అధికంగా నివసిస్తున్న తమిళనాడులో త్రిభాషా విధానం అవసరమేనని సీనియర్ నటుడు శరత్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో ఎక్కడ హిందీ తప్పనిసరి చేయలేదని, ఆయా రాష్ట్రాల్లో ప్రధాన భాషను అవసరమైతే విద్యార్థులు చదువుకోవచ్చని స్పష్టంగా ఉందని అన్నారు.