TG: వైద్యాధికారులు, స్టాఫ్నర్సుల నియామకాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ అప్డేట్ ఇచ్చారు. వైద్యవిధాన పరిషత్లో 2,077 పోస్టులను మే నెలలో భర్తీచేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 46 వేల మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని వారి చికిత్సల కోసం 4 ప్రాంతాల్లో రీజినల్ క్యాన్సర్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.