నిఫా వైరస్‌ కలకలం.. అక్కడ మళ్లీ మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

75చూసినవారు
నిఫా వైరస్‌ కలకలం.. అక్కడ మళ్లీ మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
కేరళలో నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. మరణాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో మాస్కులను తప్పనిసరి చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఈ నిబంధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పెరింతల్‌మన్నలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నిఫా‌వైరస్‌తో 23 ఏళ్ల వ్యక్తి గత సోమవారం చనిపోయాడు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేశారు.

సంబంధిత పోస్ట్