రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

3955చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడని జన్నారం పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఎస్. రామన్న శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని చెరువు వద్ద నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు బైక్ పై వెళ్లే సందర్భంలో మరో బైక్ ఢీకొందన్నారు. దీంతో ఎస్. రామన్నకు తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించే సందర్భంలో మార్గమధ్యంలో మృతి చెందాడని వారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్