పాకిస్థాన్లోని కరాచీలో గురువారం ఉదయం దారుణం జరిగింది. హత్య కేసులో నిందితులైన ఐదుగురు సోదరులు కోర్టుకు కారులో వెళ్తుండగా తొమ్మిది మంది దుండగులు చుట్టుముట్టి మెరుపు దాడి చేశారు. అకస్మాత్తుగా కారుపై తుపాకులతో కాల్చారు. ఈ దాడిలో సాజిద్, ఒమైర్ అనే ఇద్దరు సోదరులు చనిపోయారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.