ఉట్నూర్ పట్టణంలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లలో పనిచేస్తున్న సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పించారు. అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం ఉట్నూర్ పట్టణంలోని వివిధ పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లలో అగ్నిమాపక సిబ్బంది పర్యటించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి రాజలింగం ఉన్నారు.