ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయవద్దు

78చూసినవారు
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయవద్దు
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తే ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కనికారపు అశోక్ హెచ్చరించారు. సోమవారం జన్నారం పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉన్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తోందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్