పునరావాస గ్రామాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్

73చూసినవారు
పునరావాస గ్రామాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్
కడెం మండలం కొత్త మద్ధిపడగలో పునరావాసితులైన మైసంపేట్, రాంపూర్ గ్రామాల ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పునరావాస గ్రామాల ప్రజలకు కల్పిస్తున్న వసతులపై గ్రామస్తులు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పునరావాసం పొందిన ప్రజలకు కేటాయించిన వ్యవసాయ భూములను సాగుకు యోగ్యంగా చదునుగా మార్చాలన్నారు.

సంబంధిత పోస్ట్