జన్నారం మండల కేంద్రంలో మినీ ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయడం అత్యవసరమని పట్టణ ప్రజలు అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ జన్నారం పట్టణం నాలుగైదు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులు ఉందని, దీంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు, ప్రజల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. అలాగే జన్నారం బస్టాండ్ లో కావాల్సినంత స్థలం కూడా అందుబాటులో ఉందని, ప్రజల మేలు కోసం మినీ ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని వారు కోరారు.