మహా సమ్మేళనానికి వెళ్లిన నాయకులు

66చూసినవారు
ఉట్నూర్ పట్టణంలో నిర్వహించే బిజెపి గిరిజన మోర్చా మహా సమ్మేళనానికి జన్నారం మండలానికి చెందిన బిజెపి గిరిజన మోర్చా నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వారు ప్రత్యేక వాహనాల్లో ఉట్నూర్ పట్టణానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్టీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రీ నాయక్ మండల అధ్యక్షులు బోడ తిరుపతి, పలువురు గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్