ఆంక్షలు ఎత్తి వేసే వరకు ఉద్యమం

50చూసినవారు
కవ్వాల్ అభయారణ్యంలో ఆంక్షలు ఎత్తి వేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆంక్షలు ఎత్తివేత కమిటీ నాయకులు అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఆంక్షలు ఎత్తివేతపై ఆ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు, ప్రజలు హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కవ్వాల్ అభయారణ్యంలో ఆంక్షలు అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంక్షలు ఎత్తివేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్